అలోవెరా జెల్‌తో పగుళ్లు మాయం

పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాస్తే ఫలితం వుంటుంది. పగుళ్లు మాయమవుతాయి. కొవ్వొత్తి వ

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (10:28 IST)
పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాస్తే ఫలితం వుంటుంది. పగుళ్లు మాయమవుతాయి. కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనెతో కలిపి రాత్రి పూట పగుళ్లపై రాస్తే మంచి ఫలితం వుంటుంది. నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్ధన చేయాలి.
 
అరటి పండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది. పసుపు, తులసి, కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు. 
 
కొబ్బరి నూనెను దాదాపు అన్ని సమస్యలు నుండి ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు. దీనిని పగిలిన పాదాలకు చికిత్స కోసం కూడా ఉపయోగించవచ్చు.  పాదాలపై నేరుగా కొబ్బరి నూనెను రాసుకుని, ఆపై సాక్స్ ధరించాలి. కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్ వలె పని చేసి, పగుళ్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా, కొబ్బరి నూనె పాదాలపై మాత్రమే కాకుండా, లోపల పొరల్లోకి కూడా ప్రవేశించి, పాదాలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు

ఏపీలో తీవ్రమైన వడగాలులు.. మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya : సూర్య చిత్రం కరుప్పు కు తెలుగు టైటిల్ వీరభద్రుడు గా ఖరారు

Vijay Deverakonda: వారి గత జన్మలలోని వివాహ చిత్రం గా రణబాలి : రాహుల్ సంకృత్యన్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

తర్వాతి కథనం
Show comments