మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే...?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (23:26 IST)
మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని కంటి కింద రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు తొలగించుకోవటానికి టమాటాలు ఎంతగానో దోహదపడతాయి. ఒక టీ స్పూన్ టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కంటి కింద రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్‌లా చేయాలి. దీనిలో కాటన్ బాల్స్‌ను ముంచి కంటి కింద ఉంచాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
చల్లటి పాలలో దూది ఉండలను కొద్దిసేపు ఉంచి తర్వాత రిప్రిజిరేటర్లో పెట్టాలి. వీటిని కళ్లు, నల్లటి వలయాలు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తూ కంటి కింద ఉంచాలి. ఇలా తరుచుగా చేయడం వలన చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.
 
ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి కంటికింద పూయాలి. ఇలా చేయడం వలన నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా చక్కటి మెరుపు కూడా సంతరించుకుంటుంది.
 
కీరదోస ముక్కలను గుండ్రంగా తరిగి కంటి కింద పెట్టుకోవటం వలన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments