Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల అందాన్ని పెంచే చిట్కాలు ఇవిగో...

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:11 IST)
సౌందర్యం కోసం యువతులు ఆరాటపడుతుంటారు. కొందరిలో చర్మం నిగారింపు లేక కళతప్పి కనిపిస్తుంది. చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే అందుకు తగినది బాదం నూనె. ఇందులో విటమిన్ ఎ, ఇ ఉంటాయి. దీన్ని ఈ క్రింది విధంగా అప్లై చేస్తా మంచి ఫలితాలు వుంటాయి. 
 
1. ముఖ తేజస్సు పెరగాలంటే రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అర గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగు పోయి, తెల్లగా నిగారింపుతో మెరిసిపోతుంది. 
 
2. బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అర గంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.
 
3. అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.
 
4. సమపాళ్లలో బాదం నూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.
 
5. బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. కొందరి ముఖంపై, శరీరంపైన నల్లటి వలయాలు ఏర్పడతాయి. అప్పుడు బాదం నూనెలో, కొబ్బరి నూనెను కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments