Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత: ‘‘విడాకులు తీసుకుంటున్నప్పుడు నీకు ఐటమ్ సాంగ్ ఎందుకు అన్నారు... నా ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు’’

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (22:08 IST)
సినీనటి సమంత తన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం మీద తాను తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు తెలిపారు. సమంత నటించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'మిస్‌మాలిని' అనే వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడారు. పుష్ప సినిమాలో ''ఊ అంటావా మామ... ఊహు అంటావా మామ...'' అనే పాటలో నటించడం గురించి, ఆ పాట ఒప్పుకున్నందుకు వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు సమంత.
 
''ఒక గొప్ప సినిమాలో నటిస్తున్నప్పుడు, దేశంలోని గొప్ప డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్‌తో చేస్తున్నప్పుడు భయం ఉంటుంది. అల్లు అర్జున్ డ్యాన్స్ చేసేటప్పుడు, ఇక ఎవరూ కనిపించరు. అందుకే ఎక్కువ కష్టపడ్డాను'' అని సమంత అన్నారు. ''ఆ సినిమా చెయ్యి... ఈ సినిమా చేయకు...'' అంటూ మీకు ఎవరైనా సలహాలు ఇస్తారా? ప్రశ్నించినప్పుడు సమంత ఇలా స్పందించారు. ''మేం విడిపోతున్న సమయంలో ఊ అంటావా... అనే పాట వచ్చింది.
 
నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా ఇంట్లో వాళ్లు అందరూ నన్ను ఇంట్లో కూర్చొమన్నారు. విడాకులు తీసుకుంటున్నానని అందరికీ చెప్పిన నువ్వు ఇప్పుడు ఐటం సాంగ్ చేయకూడదు అని వారు అన్నారు. ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసే నా స్నేహితులు... నువ్వు చేయగలవు నీకు నీవు సవాల్ చేసుకో అంటూ చెప్పే వారు కూడా.. ఆ సమయంలో నో అన్నారు. ఐటమ్ సాంగ్ వద్దు అన్నారు.
 
కానీ నేను చేస్తాను అన్నాను. నేనేమీ తప్పు చేయనప్పుడు, నేనెందుకు దాక్కోవాలి? ట్రోలింగ్స్ ఆగేంత వరకు వేచిచూసి, ఏదో నేరం చేసిన దానిలా ఆ తర్వాత మెల్లగా బయటికి రావాలనుకోలేదు. 100 శాతం నా పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చాను. కానీ అది వర్కవుట్ కాలేదు. అంతేకానీ నేను ఏమీ చేయని దానికి నన్ను నేను ఎందుకు శిక్షించుకోవాలి? నాకు పాటలోని లిరిక్స్ నచ్చాయి. అది డిఫరెంట్ క్యారెక్టర్‌గానే అనిపించింది. నేను ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు అనిపించలేదు. ప్రతి కొత్త దాన్ని ట్రై చేయాలని అని అనుకున్నా. నా జీవితంలోని ఓటములు, బలహీనతలు వంటివి అందరికీ చెబితే అవి ఎవరికొకరికి ఉపయోగపడతాయని భావించా. ఒకశాతం మందికి లాభం చేకూరినా చాలు'' అని సమంత తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments