చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌గ్రిడ్‌లో రూ.2000 కోట్ల స్కామ్‌

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (14:23 IST)
ఆంధ్ర ప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.2000 కోట్ల అవినీతి జరిగిందని, చంద్రబాబు ఆధ్వర్యంలోని ఆ శాఖ ఫైలుపై నారా లోకేశ్‌ సంతకం చేయడమే ఇందుకు రుజువని సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.

 
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నిన్న ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారని, ఈ స్కామ్‌లోని పలు అంశాలను అంగీకరించిన ఆయన తర్వాత మాట మార్చారని ఈ కథనం పేర్కొంది.

 
చంద్రబాబు శాఖ ఫైలు మీద లోకేశ్‌ సంతకం వ్యవహారాన్ని హరికృష్ణప్రసాద్‌ ముందు అంగీకరించి తర్వాత మళ్లీ కాదన్నారని ఈ కథనం పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో రూ.2200 కే దొరుకుతున్న సెట్‌టాప్‌బాక్సులను టీడీపీ ప్రభుత్వం అప్పటి ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన కంపెనీ నుంచి రూ.4400 కొన్నదని, ప్రభుత్వ ఖజానాకు దీనివల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఈ కథనం వెల్లడించింది.

 
ఇంటింటికి ఇంటర్నెట్‌ కోసం చంద్రబాబు ప్రతిష్టాత్మకం ప్రవేశపెట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ పథకంలో అనేక అవకతవకలు జరిగాయని సాక్షి పత్రిక తన కథనంలో ఆరోపించింది. అయితే తాను సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని, ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌ కమిటీలో తానులేనని హరికృష్ణ ప్రసాద్‌ చెప్పినట్లు సాక్షి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments