Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం: పిడుగులు పడి 18 ఏనుగులు మృతి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (11:53 IST)
అస్సాంలోని నాగావ్ జిల్లాలో 18 ఏనుగులు మృతి చెందాయి. కండోలీ అభయారణ్యంలో పిడుగులు పడడంతో ఆ ఏనుగుల మంద ప్రాణాలు కోల్పోయిందని అక్కడి అటవీ అధికారులు వెల్లడించారు. అభయారణ్యం సమీపంలోని గ్రామస్థులకు అడవిలో ఏనుగుల కళేబరాలు పెద్దసంఖ్యలో కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ''పెద్ద సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడడం కలచివేసింది. దీనిపై విచారణకు ఆదేశించాను'' అని ఆయన చెప్పారు. భారత్‌లో 27 వేలకు పైగా ఏనుగులు ఉండగా అందులో 21 శాతం ఒక్క అస్సాం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో ఏనుగులు చనిపోవడం అస్సాంలో గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.

 
ఏనుగుల మరణంపై అస్సాం అటవీ మంత్రి పరిమళ్ శుక్లవైద్య కూడా స్పందించారు. కథియాటోలీ రేంజ్ అటవీ ప్రాంతంలో భారీగా పిడుగులు పడి 18 ఏనుగులు మరణించడం బాధాకరం అంటూ ఆయన స్పందించారు. అటవీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరుపుతారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments