Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం: పిడుగులు పడి 18 ఏనుగులు మృతి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (11:53 IST)
అస్సాంలోని నాగావ్ జిల్లాలో 18 ఏనుగులు మృతి చెందాయి. కండోలీ అభయారణ్యంలో పిడుగులు పడడంతో ఆ ఏనుగుల మంద ప్రాణాలు కోల్పోయిందని అక్కడి అటవీ అధికారులు వెల్లడించారు. అభయారణ్యం సమీపంలోని గ్రామస్థులకు అడవిలో ఏనుగుల కళేబరాలు పెద్దసంఖ్యలో కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ''పెద్ద సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడడం కలచివేసింది. దీనిపై విచారణకు ఆదేశించాను'' అని ఆయన చెప్పారు. భారత్‌లో 27 వేలకు పైగా ఏనుగులు ఉండగా అందులో 21 శాతం ఒక్క అస్సాం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో ఏనుగులు చనిపోవడం అస్సాంలో గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.

 
ఏనుగుల మరణంపై అస్సాం అటవీ మంత్రి పరిమళ్ శుక్లవైద్య కూడా స్పందించారు. కథియాటోలీ రేంజ్ అటవీ ప్రాంతంలో భారీగా పిడుగులు పడి 18 ఏనుగులు మరణించడం బాధాకరం అంటూ ఆయన స్పందించారు. అటవీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరుపుతారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments