Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష మంది సినీ కార్మికులను ఆదుకుంటా: అమితాబ్ బచ్చన్ - ప్రెస్ రివ్యూ

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (16:41 IST)
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముందుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలు ఇవీ...
 
ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన లక్ష మంది కార్మికులకు నెల రోజుల పాటు నిత్యావసరాలను అందజేస్తానని 'బిగ్ బి' అమితాబచ్చన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సోనీ పిక్చర్స్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ స్వాగతించాయి.
 
మరోవైపు కరోనా నియంత్రణకు కేంద్ర మానవ వనరుల శాఖ కింద ఉన్న 28 విభాగాలు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.38 కోట్ల విరాళం ప్రకటించాయి. కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది రూ.10 కోట్లు, నవోదయ పాఠశాలలు రూ.7.5 కోట్లు విరాళం ఇచ్చాయి.
 
ఇండియన్‌ బ్యాంకు ఉద్యోగులు 43 వేల మంది రూ.8.1 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందజేశారు. పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రతిరోజు లక్ష మందికి ఆహారం అందజేస్తున్నామని ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌ తెలిపారు.
 
భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 5 వేల కుటుంబాలకు నిత్యావసరాలను అందించాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments