Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగినులు ఇడ్లీతో పాటు ఉడికించిన గుడ్డు తీసుకుంటే..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (12:48 IST)
ఉద్యోగినులు అల్పాహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఉద్యోగినులు అల్పాహారంలో ఉడికించిన కోడిగుడ్డు, సోయాతో పాటు ఇడ్లీలు వుండేలా చూసుకోవాలి.. అంటున్నారు.. న్యూట్రీషియన్లు. అంతేగాకుండా అల్పాహారంతోపాటు ఓ గ్లాసు రాగి జావ తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. 
 
మధ్యాహ్నం భోజనంలో కూరగాయలతో చేసిన కూరలు, ఉడికించిన గుడ్డు లేదా కొంత మొత్తంలో సోయా తీసుకుంటే శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. సాయంత్రంపూట అల్పాహారంలో ఉడికించిన సెనగలు, పెసలు, పాప్‌కార్న్‌ ఉండేలా చూసుకుంటే పొట్ట నిండినట్లు ఉంటుంది. ఇలా చేస్తే మహిళలు బరువు పెరగరు. 
 
అలాగే అల్పాహారంలో ఇడ్లీలు వుండేలా చూసుకుంటే బరువు పెరగరు. మినుములు, బియ్యం పిండితో చేసే ఇడ్లీ బలవర్ధకం కూడా. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు మినుముల్లో ఎక్కువగా ఉంటాయి. సత్వరశక్తికి బాగా ఉపయోగపడతాయి. 
 
ఇది తేలికగా జీర్ణమవుతుంది. మధుమేహంతో బాధపడేవారు, అధిక బరువుతో ఇబ్బందిపడే వారికి ఇదే సరైన ఆహారం. రోజూ ఒకేలా అనిపిస్తే.. రాగి, జొన్న పిండి కలుపుకొని ఇడ్లీలు తయారు చేసుకుని తీసుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments