Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్థులు చలికాలంలో కందగడ్డను తింటే?

చలికాలంలో జొన్నలు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన క్యాల్షియం లభిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (11:48 IST)
చలికాలంలో జొన్నలు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన క్యాల్షియం లభిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టె, జొన్నలతో చేసిన సంకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకున్నట్లేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే చలికాలంలో ఏర్పడే జలుబు, దగ్గును దూరం చేసుకోవాలంటే.. దానిమ్మను చలికాలంలో తినాలి. దానిమ్మ ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దానిమ్మ రక్షణనిస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణలో కూడా దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో వెచ్చదనం కోసం నువ్వులు తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సక్రమంగా వుంటుంది. ఇంకా నువ్వుల్లో వుండే ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి.
 
చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కంద గడ్డలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూర్చినవారవుతారు. కందగడ్డల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా చలికాలంలో వారానికి రెండుసార్లు పాలకూర తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలపు వ్యాధులను నివారించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండి.. రక్తం పెరగడానికి దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments