Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం తాంబూలం తింటే..? ఎప్పుడు తినకూడదో తెలుసా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (14:48 IST)
భోజనం చేసిన తరువాత.. అగరువత్తుల పొగవలన, కారం చేదు, వగరు కలిగిన ఫలరసముల వలనగానీ, వక్క, కస్తూరి, లవంగం, జాజికాయగానీ, తాంబూలముగానీ తీసుకోవడం వలన భోజనం వలన కలుగు కఫదోషములు తొలగిపోతాయి. మరికొన్ని ఆరోగ్య ఆయుర్వేద చిట్కాలు..
 
1. నిద్రలేచినప్పుడు, స్నానం చేసినపుడు, భుజించిన తరువాత, వాంతి అయినపుడు తాంబూలము వేసుకొనవచ్చును. తాంబూలంలో కారం, తీపి, వగరు, చేదు కలిగి ఉంటాయి. వీటి వలన వాత, కఫ వ్యాధులు దరిచేరవు. నోటియందు క్రిములు నశిస్తాయి. నోటిదుర్గంధము తొలగిపోతుంది. కామోద్దీపనము కలిగించును.
 
2.  తాంబూలంలో వాడు కాచు.. కఫ, పిత్తములను, సున్నము, వాతమును హరించగలవు. కాబట్టి... ఈ మూడు దోషములు తాంబూలము వలన పోవును. ఉదయాన్నే వక్క ఎక్కువగానూ, మధ్యాహ్నం.. కాచు ఎక్కువగానూ, రాత్రులు సున్నము ఎక్కువగానూ ఉండేలా తాంబూలాన్ని తయారుచేసుకోవాలి.
 
3. తాంబూలము నమిలేటపుడు... మొదటి జనించు రసం విషతుల్యమగును. రెండవసారి జనించు రసం అజీర్ణమునకు కారణమగును. మూడవసారి జనించే రసం అమృతతుల్యమగును. కాబట్టి తాంబూలం వేసికున్న తరువాత మొదటి రసాలను ఉమ్మివేస్తూ చివరి రసాలను మాత్రమే మ్రింగుట ఆరోగ్యకరం.
 
4. దంత పటుత్వం లేనివారు.. నేత్రరోగములు, విషము, మదుము, మూర్చ, గాయములు, రక్తపిత్తములు గల రోగములు గలవారు తాంబూలము సేవించరాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments