Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:06 IST)
ఆంధ్రుల సంస్కృతిలో, ఆచార వ్యవహారాల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళకరమైనది. మన రోజువారి ఆహారంలో పసుపు ఒక భాగంగా నిల్చిపోయింది. శుభకార్యాల్లో పసుపును కాళ్ళకు, ముఖానికి రాసుకోవడం మంగళప్రదంగా భావిస్తారు. మన ఆంధ్రదేశ్ వనితలు, దీనిని తెలుగులో పసుపు, సంస్కృతిలో హరిద్రా అని పిలుస్తారు. 
 
1. పసుపు, చందనం రెండింటిని పాలమీద మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకుని తరువాత చన్నీళ్ళతో శుభ్రంగా కడిగిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. శరీర కాంతి ఇనుమడిస్తుంది.
 
2. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
3. దాదాపు 10 గ్రాముల పచ్చి పసుపు 20-40 గ్రాముల ఆవు పెరుగు నందు కలిపి ఉదయం సేవించినచో కామెర్లు తగ్గుతాయి. ఆహారం కారం, పులుపు, మసాల వస్తువులు ఇవ్వకూడదు.
 
4. పసుపు, వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి. 
 
5. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న ప్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. 
 
6. పసుపు, తులసి ఆకుల రసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments