Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పసుపులో ఆవు పెరుగు కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:06 IST)
ఆంధ్రుల సంస్కృతిలో, ఆచార వ్యవహారాల్లో పసుపుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళకరమైనది. మన రోజువారి ఆహారంలో పసుపు ఒక భాగంగా నిల్చిపోయింది. శుభకార్యాల్లో పసుపును కాళ్ళకు, ముఖానికి రాసుకోవడం మంగళప్రదంగా భావిస్తారు. మన ఆంధ్రదేశ్ వనితలు, దీనిని తెలుగులో పసుపు, సంస్కృతిలో హరిద్రా అని పిలుస్తారు. 
 
1. పసుపు, చందనం రెండింటిని పాలమీద మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకుని తరువాత చన్నీళ్ళతో శుభ్రంగా కడిగిన ముఖ వర్చస్సు పెరుగుతుంది. శరీర కాంతి ఇనుమడిస్తుంది.
 
2. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
3. దాదాపు 10 గ్రాముల పచ్చి పసుపు 20-40 గ్రాముల ఆవు పెరుగు నందు కలిపి ఉదయం సేవించినచో కామెర్లు తగ్గుతాయి. ఆహారం కారం, పులుపు, మసాల వస్తువులు ఇవ్వకూడదు.
 
4. పసుపు, వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయమవుతాయి. 
 
5. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న ప్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. 
 
6. పసుపు, తులసి ఆకుల రసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయి. 

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments