Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ అమ్మకు ఇంటి పత్రాలు ఇచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (22:27 IST)
త‌మిళ‌నాడులో కేవ‌లం రూ.1కే ఇడ్లీలు అమ్మిన వృద్ధురాలు అందరికీ గుర్తుండే వుంటుంది. ఆమెను అక్క‌డంద‌రూ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. ఆమె అస‌లు పేరు కె.క‌మ‌ల‌త‌ల్‌. 2019 సెప్టెంబ‌ర్ నెల‌లో ఆమె గురించిన ఓ వీడియో వైర‌ల్ అయింది. 
 
ఆమె క‌ట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేస్తూ పేద‌లు, కూలీల‌కు కేవ‌లం రూ.1కే ఒక ఇడ్లీ అమ్మేది. ఆమె అలా 30 ఏళ్ల నుంచి ఇడ్లీల‌ను త‌యారు చేసి అందిస్తోంది. అయితే ఆమె వీడియో వైర‌ల్ అయ్యాక ఆమెకు స‌హ‌యం చేసేందుకు చాలా మంది ముందుకు వ‌చ్చారు.
 
ఇలా కమ‌ల‌త‌ల్ వీడియో వైర‌ల్ అయ్యాక మహీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఎల్‌పీజీ క‌నెక్ష‌న్ ఇప్పించారు. అలాగే ఆమెకు ఇల్లు క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయ‌న ఆమెకు తాజాగా ఇంటిని అంద‌జేశారు. ఆమె ఇంటి ప‌త్రాల‌ను అందుకుంది.

అప్ప‌ట్లో ఆమె త‌న‌కు ఓ ఇల్లు ఉంటే బాగుండున‌ని, దీంతో మ‌రింత మందికి ఇడ్లీల‌ను విక్ర‌యించేదాన్న‌ని చెప్పింది. ఆమె కోరిక తెలుసుకున్న ఆనంద్ మ‌హీంద్రా ఆమెకు ఇంటిని అంద‌జేశారు. ఆమెకు ఇంటిని అందించినందుకు గాను నెటిజ‌న్లు ఆనంద్ మ‌హీంద్రాను కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

తర్వాతి కథనం
Show comments