బొప్పాయి గుజ్జు ముఖానికి పట్టిస్తే..?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (15:51 IST)
చలికాలంలో చాలామందికి ముఖం పొడిబారి చర్మమంతా అలసట, నీరసంగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం లభించాలని రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌‌లు వాడుతుంటారు. దాంతో సమస్య మరింత ఎక్కువగా మారుతుంది. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చును.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
తప్పకుండా అందరూ ప్రతిరోజూ స్నానం చేస్తూనే ఉంటారు. అయినా చర్మమంతా తెల్లతెల్లగా మారి దురదలు పెడుతూ వుంటుంది కొందరికి. అలాంటప్పుడు స్నానానికి వాడే సబ్బుకు బదులుగా సున్నిపిండిని ఉపయోగించాలి. 
 
ఒక పెద్ద అరటిపండును తొక్కతీసి.. పండును గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులో 2 స్పూన్ల గులాబీ నీరు కొద్దిగా తేనె, పాలపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కుని పొడి టవల్‌తో తుడుచుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 
 
బొప్పాయి పండు ఈ సీజన్‌లో విరివిగా దొరుకుతుంది. కాబట్టి ఓ బొప్పాయి పండు రెండు సగాలుగా కట్ చేసి వాటిలోని గింజలు తీసేయాలి. ఆ తరువాత దాని తొక్కను తీసి పండును గుజ్జులా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఆపిల్ రసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. రెండుగంటల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చాలు. చర్మం సున్నితంగా తయారవుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా... మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వు...

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు షాకిచ్చిన తెలంగాణ జాగ్రతి - ఏకంగా మున్సిపాలిటీ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన

చిట్యాల మునిసిపాలిటీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మొదటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తి

గోదావరి జిల్లా తీర ప్రాంతాల్లో 49 తాబేళ్లు చనిపోయాయి.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: ఓటీటీలో రికార్డు సృష్టించిన మన శంకర వర ప్రసాద్ గారు

నడిరోడ్డు మీద నటులు విజయ్, అజిత్ ఫైటింగ్, వీడియో వైరల్

అవి గాసిప్స్ మాత్రమే.. వాలెంటైన్స్ డే ఏప్రిల్ ఫూల్స్ డేగా మారుతుంది.. మృణాల్

Naresh: చీరలు కట్టుకొచ్చారు, ఇంకేం హగ్ చేసుకునేది: సీనియర్ నరేష్

కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్

తర్వాతి కథనం
Show comments