Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంధాన్ని ముఖానికి పట్టిస్తే..?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:31 IST)
చర్మ సౌందర్యానికి గంధం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. గంధాన్ని అరగదీసి కళ్ళమీద రాసుకుంటే కళ్ళ ఎరుపు మంటలు తగ్గుతాయి. చందనంతో తయారైన సోపులు, పౌడర్లు వాడితే చర్మానికి మంచిది. ఇంకా స్నానం చేసే నీళ్ళల్లో గంధం నూనె 5 లేదా 6 చుక్కలు వేసుకుని స్నానం చేస్తే వ్యాధులు రావు. శరీరం తాజాగా ఉంటుంది. చందనాది తైలం వలన తలనొప్పి కళ్ళమంటలు తగ్గుతాయి. 
 
గంధాన్ని అరగదీసి అందులో కొద్దిగా పసుపు, రోజ్‌వాటర్ చేర్చుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఆపై అరగంటపాటు అలానే ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. ముడతలు చర్మం ఉండదు. 
 
ఆలివ్ ఆయిల్‌లో గంధం కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. గాయాలకు చందనం పూస్తే వెంటనే మానిపోతాయి. గంధం చర్మానికి యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. గంధాన్ని అరగదీసి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం నున్నంగా తయారవుతుంది. గంధంలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మానికి మంచి ప్యాక్‌లా ఉపయోగపడుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments