Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుడితో మేమూ సమానం.. ఓ పెగ్గు వేయాల్సిందే : మహిళల మనోగతం

సమాజంలో పురుషుడితో మేమూ సమానమే. వారితో పాటు మేమూ ఆర్థికంగా స్థిరపడుతున్నాం. వారిలానే మేమూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. అలాంటపుడు మేము కూడా ఓ పెగ్గు వేయాల్సిందేనంటూ దేశంలోని మగువలు తెగేసి చెపుతున్నారు.

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (08:31 IST)
సమాజంలో పురుషుడితో మేమూ సమానమే. వారితో పాటు మేమూ ఆర్థికంగా స్థిరపడుతున్నాం. వారిలానే మేమూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. అలాంటపుడు మేము కూడా ఓ పెగ్గు వేయాల్సిందేనంటూ దేశంలోని మగువలు తెగేసి చెపుతున్నారు. ముఖ్యంగా.. నగరాల్లో నివశించే మహిళలు.. యేడాదిలో ఒక్కసారైనా మద్యం రుచి చూస్తున్నారట. ఇలా రుచి చూస్తున్న వారు ఐదు శాతం ఉండగా, వీరి వల్ల ఏటా 30 శాతం అమ్మకాలు పెరుగుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. 
 
నిజానికి మద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్‌ కారకం. ఎక్కడ చూసినా మనకు కనిపించే ప్రకటన ఇది. ఇలా అవగాహన పెంచడం వల్ల ఎక్కువ మంది ఈ అలవాట్లకు దూరమవుతారని ప్రభుత్వం ఆశ. కానీ జరుగుతోంది వేరు. ఇప్పటి వరకూ మద్యపానం పురుషులకే పరిమితం అన్నట్టుండేది. క్రమంగా ఈ ధోరణి మారుతోంది. మహిళల్లోనూ మద్యపానం పెరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలతో పోల్చితే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు దాదాపు పురుషులతో సమానంగా మద్యం తాగుతున్నారట.
 
ఇదే విషయంపై ఆస్ట్రేలియాలని న్యూ సౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయం ఐదేళ్ళపాటు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన మేరకు ఒకప్పుడు మద్యపానం విషయంలో పురుషులు, మహిళల మధ్య తేడా 12 రెట్లుగా ఉండగా, ఇపుడది బాగా తగ్గిపోయింది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దేశంలో మద్యం తాగే మహిళలు చాలా తక్కువ. కానీ నగరాల్లో క్రమంగా పెరుగుతున్నారు. అమెరికాలో 60 శాతం మంది మహిళలు ఏడాదిలో ఒక్కసారైనా మద్యం రుచి చూస్తుండగా ఈ రేటు భారత నగరాల్లో 5 శాతంగా ఉన్నట్లు అంచనా వేసింది. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments