Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మంచిదా? సంగీతం వినడం మంచిదా? తెలుసుకోండి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:31 IST)
పిల్లలకు నచ్చిన బొమ్మలు తీసిపెట్టి.. ఆడుకోండని పనులు చేసుకునే తల్లిదండ్రులా మీరు.. అయితే ఒక్క క్షణం ఆగండి. పిల్లలకు బొమ్మలు తీసిపెట్టడం కంటే.. సంగీతం వినిపించండి అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. సంగీతం వింటే పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బొమ్మలతో ఆడుకునే పిల్లలతో పోల్చితే.. సంగీతం వినే పిల్లల్లో వినికిడి శక్తి బాగా పెరుగుతున్నట్లు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ (ఐ-ల్యాబ్స్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 
 
సంగీతాన్ని వినడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడం, సంగీత విన్యాసాలను గ్రహించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఐ-ల్యాబ్స్ కో డైరక్టర్, అధ్యయన నివేదిక సహ రచయిత పట్రిసియా కుహ్ల్ వెల్లడించారు. సంగీతం వినడం ద్వారా తెలివితేటలు పెరగుతాయి. సంగీతాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని.. సంగీతాన్ని వినడం ద్వారా సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుందని కుహ్ల్ తెలిపారు. ఈ స్టోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మేగజైన్‌లో ప్రచురితమైంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments