Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ స్పెషల్ : కమ్మని మజ్జిగతో పుల్లట్లు ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:08 IST)
అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్లో శరీరానికి చల్లదనాన్నిచ్చే పెరుగు, మెంతులతో చేసే వంటకాలను తీసుకుంటే మంచిది. మజ్జిగ ఆరోగ్యానికి క్యాల్షియం అందజేస్తుంది. ఇక మెంతులు శరీర ఉష్ణాన్ని నియంత్రించి అందం, ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. ఇక కేశాలను, చర్మాన్ని సంరక్షిస్తుంది. అలాంటి మజ్జిగ, మెంతులతో పుల్లట్లను వెరైటీగా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
పుల్లటి మజ్జిగ : నాలుగు కప్పులు 
బియ్యం - రెండు కప్పులు 
మెంతులు - మూడు స్పూన్లు 
జీలకర్ర - రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి- ఆరు 
ఉప్పు - తగినంత 
జీలకర్ర - స్పూన్ 
నూనె - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పెనంపై పలుచగా చేసుకోవాలి. ఇరు వైపుల నూనె, లేదా నేతిని పోయాలి. ఇక దోసెలు దోరగా వేగాక సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ దోసెలను గ్రీన్ చట్నీ లేదా టమోటా చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం
Show comments