కంటికి రెప్పపాటు చాలా అవసరం.. లేకుంటే..?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (20:39 IST)
కంటికి రెప్పపాటు చాలా అవసరం. రెప్పవేయడం వల్ల కళ్లు పొడిబారకుండా తేమగా ఉంటాయి. ఎక్కువ సమయం కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కంటిని బ్లింక్ చేయడం ప్రభావితమవుతుంది. తదేకంగా కంప్యూటర్లను చూడటం ద్వారా కళ్లల్లోని తేమ ఆవిరైపోతుంది. 
 
అందుకే ప్రతి గంటకు కొన్ని సెకన్ల పాటు మీ కళ్ళు రెప్పవేయడం కొనసాగించాలి. తర్వాత కొన్ని సెకన్ల పాటు కళ్లు మూసి.. కూర్చుని రిలాక్స్ కావాలి. ఈ వ్యాయామం కనురెప్పలను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. తద్వారా కళ్లలో తగినంత తేమ నిల్వ ఉంటుంది. ఆప్టిక్ నరాలు రక్షించబడతాయి.
 
కంటి పొడి సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి కంటికి ఐ డ్రాప్ వాడాలి. కళ్లు ఎరుపు తిరగడాన్ని నివారించేందుకు కంటి తేమ అవసరం. అందుకే కంటికి రెప్పపాటు అవసరం.
 
ఏ పనికైనా విశ్రాంతి తప్పనిసరి. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, మెడ నొప్పి, భుజం నొప్పి మొదలైన సమస్యలను నివారించడానికి, నిరంతర కంప్యూటర్ వినియోగం మధ్య తగిన విరామం తీసుకోవాలి. రోజంతా కూర్చుని పని చేసే బదులు కనీసం ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి నడవాలి. చేతులు, కాళ్లు, మెడను చాచి, కంటి వ్యాయామాలు చేయాలి. 
 
అర్థరాత్రి మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ చూడవద్దు. పడుకునే ముందు కనీసం గంటసేపు ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లను చూడటం మానుకోవాలి. ఇది నిద్రలో మెలటోనిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తెలంగాణకు గోదావరి జలాలు

హలో నెతన్యాహు జీ... మా పౌరులను భద్రంగా చూసుకోండి : ప్రధాని మోడీ

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా పేరు మార్చాలి.. గరికపాటి నరసింహారావు

ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు నేను సిద్ధంగా వున్నాను.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

తర్వాతి కథనం
Show comments