గరిక పోచలతో వినాయక పూజ చేస్తే?

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (12:23 IST)
విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థినాడు పూజించే భక్తులకు క్షేమం, లాభం కలుగుతుందని విశ్వాసం. అందువల్ల వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైంది 21 పత్రపూజ అని, వీటిలో గరిక (దూర్వాపత్రం)తో వినాయక స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. గణనాథుడికి ఎక్కువ ఇష్టమైన గరికను విఘ్నేశ్వర పూజలో జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలి.  
 
యమధర్మరాజు కుమారుడైన అనలాసురుడు.. అగ్ని సంబంధిత తేజస్సుతో పుట్టడం వల్ల అతని శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాల్ని బాధిస్తుంటాయి. ఆ సమయంలో గణేశుడిని దేవేంద్రుడైన ఇంద్రుడు ప్రార్థించగా.. విఘ్నేశ్వరుడు అనలాసురుడిని నమిలి మింగేస్తాడు.
 
ఫలితంగా గణపయ్య బొజ్జలో అధిక ఉష్ణం జనించి, తాపం కలుగుతుంది. అమృతాలతో అభిషేకించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు ముక్కంటి అయిన పరమేశ్వరుడు జంట గరికపోచలతో గణేశ్వరుడిని పూజచేయాలని సూచిస్తాడు. పరమేశ్వరుని సలహాతో దేవతలు గణపతిని పూజిస్తారు. ఆ గరిక పూజతో గణపతి తాపం చల్లారిపోతుంది. అప్పటి నుంచి గణపతికి గరిక ప్రీతిపాత్రమైందని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా బిల్లు పేరుతో దక్షిణ భారత బలాన్ని తగ్గించే కుట్ర : రాహుల్ గాంధీ

స్టేట్ టాపర్ కాజల్ మీనా, సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ అయ్యింది కానీ బుద్ధి గడ్డి తిన్నది

కాశ్మీర్ టులిప్ గార్డెన్, 10 ఏళ్లలో 30 లక్షల మంది పర్యాటకుల సందర్శన

అమ్మా.... నేను పాసయ్యాను : తల్లికి ఫోన్ చేసి విద్యార్థిని భావోద్వేగం

అద్దంకి భవాని సెంటర్లో నడిరోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, కారణం ఇదే...

అన్నీ చూడండి

లేటెస్ట్

పళ్లెంలో వడ్డించిన భోజనాన్ని మెతుకు మిగలకుండా తింటే దరిద్రం వస్తుందా?

చైత్ర అమావాస్య: చీమలకు పంచదార.. సర్పదోషాలు మటాష్

తిరుమలలో భక్తుల రద్దీ.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

15-04-2026 బుధవారం ఫలితాలు - రుణసమస్య పరిష్కారమవుతుంది.. ఖర్చులు సామాన్యం...

అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?

తర్వాతి కథనం
Show comments