తయారీ విధానం: ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరపకాయలను సన్నగా తరగాలి. పప్పులన్నింటిని శనగపప్పు, జీడిపప్పు, మొక్కజొన్న, గోధుమలను విడివిడిగా వేయించి కాస్త రవ్వలా పట్టించాలి. అలాగే అందులో కావాల్సినంత నీరు పోసి బాగా కరిగించి దోసె పిండిలా చేసుకోవాలి.
ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, మిరియాలపొడి, ఉప్పు కలిపి కరిగించిన పిండిలో ఆమ్లెట్ లాగా దోసకాయల్లో పోసి మరిగిస్తే రుచికరమైన ఎగ్ లెస్ 'వెజిటేరియన్ ఆమ్లెట్' రెడీ అయినట్లే. ఈ ఆమ్లెట్ డైట్లో వున్నవారికి ఎంతో మేలు చేస్తుంది.