Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2021-22 : పట్టాలెక్కని హామీలు - అమరావతికి రైలు ఊసేది?

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (08:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విశాఖపట్టణానికి రైల్వే జోన్ కేటాయించడం. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక్కటంటే ఒక్క హామీ కూడా పట్టాలెక్కలేదు. అందులో ఒకటి విశాఖ రైల్వే జోన్. 
 
విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించి రెండేళ్లు అయింది. రాష్ట్రంలోని 3,496 కి.మీ. మార్గమంతా దీని పరిధిలోకి వచ్చేలా అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (సమగ్ర ప్రణాళికా నివేదిక)ను పంపారు. దాదాపు రూ.200 కోట్లు అవసరమున్నా... ఇప్పటికీ ముందడుగు పడలేదు. గత బడ్జెట్‌లో కొత్త జోన్‌, రాయగడలో కొత్త డివిజన్‌ ఏర్పాటుకు కలిపి తూర్పుకోస్తా జోన్‌ బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.3 కోట్లు కేటాయించారు. వాటిని రాయగడకే ఖర్చు చేస్తున్నారు.
 
అలాగే, నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతిని రైలుమార్గంతో అనుసంధానించే ప్రాజెక్టు మంజూరైనా నిధులివ్వడం లేదు. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరుకు మూడు మార్గాలుగా కలిపి 106 కి.మీ. మేర కొత్తలైన్‌ మంజూరు చేశారు. మాచెర్ల - నల్గొండ(92 కి.మీ.), కాకినాడ - పిఠాపురం (21.5 కి.మీ.), గూడూరు - దుగ్గరాజపట్నం(41.55 కి.మీ.), కొవ్వూరు - భద్రాచలం(151 కి.మీ.), కంభం - ప్రొద్దుటూరు (142 కి.మీ.) కొత్త మార్గాలు మంజూరైనా నిధులు ఇవ్వడంలేదు.
 
ముఖ్యంగా, విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి-65 వెంట హైస్పీడ్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌ కావాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఇదివస్తే తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం సులభమవ్వడమే కాకుండా, దూరమూ తగ్గుతుంది. ఈ మార్గంలో హైస్పీడు రైలు ఏర్పాటు చేయాలని ఎంపీలు చాన్నాళ్లుగా కోరుతున్నా స్పందనలేదు. వీటిపై ఈసారైనా విత్తమంత్రి నిర్మలా సీతారమన్ దృష్టిసారిస్తారో లేదో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments