Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఐటీ శ్లాబులతో ఎలాంటి నష్టం ఉండదట.. ఎలాగంటే...

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:15 IST)
ఈనెల ఒకటో తేదీన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ 2020-21ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను (ఐటీ)కు సంబంధించి మినహాయింపులు, తగ్గింపులు లేకుండా కొత్త శ్లాబులు ప్రకటించారు. ఈ శ్లాబులపై గందరగోళం కొనసాగుతోంది. ఈ గందరగోళానికి తెరదించేందుకు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ప్రయత్నించారు. 
 
ఈ కొత్త శ్లాబుల విధానంతో ఎవరికీ నష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 'ఏ విధానం ప్రయోజనకరం, ఏది కాదని మేము చెప్పడం లేదు. ఆ విషయం ఐటీ చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఆంక్షలూ పెట్టం. కొత్త విధానం ఎవరికీ హాని చేయకపోయినా, కొందరికి మాత్రం మేలు చేస్తుంది. ఒక్కరు కూడా ఈ కొత్త విధానంతో నష్టపోరు' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే ఐటీ శ్లాబులను ఎంచుకునే విషయంలో ప్రతి పన్ను చెల్లింపుదారునికి స్వేచ్ఛ ఉందనీ, అందువల్ల ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఐటీ చెల్లించే వారిలో 30-40 శాతం మందికి కొత్త విధానం ఎక్కువ ప్రయోజనకం చేకూర్చే అవకాశం ఉందన్నారు. అలా చూసినా అది పెద్ద విషయమేని చెప్పారు. ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ వంటి సౌకర్యంలేని చిన్న వ్యాపారులు, దుకాణాల యజమానులకు కొత్త శ్లాబుల విధానం మేలు చేస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments