Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఐటీ శ్లాబులతో ఎలాంటి నష్టం ఉండదట.. ఎలాగంటే...

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:15 IST)
ఈనెల ఒకటో తేదీన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ 2020-21ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను (ఐటీ)కు సంబంధించి మినహాయింపులు, తగ్గింపులు లేకుండా కొత్త శ్లాబులు ప్రకటించారు. ఈ శ్లాబులపై గందరగోళం కొనసాగుతోంది. ఈ గందరగోళానికి తెరదించేందుకు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ప్రయత్నించారు. 
 
ఈ కొత్త శ్లాబుల విధానంతో ఎవరికీ నష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 'ఏ విధానం ప్రయోజనకరం, ఏది కాదని మేము చెప్పడం లేదు. ఆ విషయం ఐటీ చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఆంక్షలూ పెట్టం. కొత్త విధానం ఎవరికీ హాని చేయకపోయినా, కొందరికి మాత్రం మేలు చేస్తుంది. ఒక్కరు కూడా ఈ కొత్త విధానంతో నష్టపోరు' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే ఐటీ శ్లాబులను ఎంచుకునే విషయంలో ప్రతి పన్ను చెల్లింపుదారునికి స్వేచ్ఛ ఉందనీ, అందువల్ల ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఐటీ చెల్లించే వారిలో 30-40 శాతం మందికి కొత్త విధానం ఎక్కువ ప్రయోజనకం చేకూర్చే అవకాశం ఉందన్నారు. అలా చూసినా అది పెద్ద విషయమేని చెప్పారు. ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ వంటి సౌకర్యంలేని చిన్న వ్యాపారులు, దుకాణాల యజమానులకు కొత్త శ్లాబుల విధానం మేలు చేస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments