Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2020 ఎఫెక్ట్ : ధరలు పెరిగే వస్తువులేంటి? తగ్గేవి?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:15 IST)
కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21కి గాను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం ఆమె లోక్‌సభకు తన బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచినా.. అందరికి ఆమోదభాగ్యంగానే కేంద్రం బడ్జెట్‌ను సమర్పించింది.
 
అయితే, ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని పెంచారు. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫర్నీచర్, చెప్పులు ధరలు పెరగనున్నాయి. అలాగే ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపు కారణంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. 
 
మరోవైపు, ఎలక్ట్రికల్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలపై కేంద్రం పన్ను తగ్గించింది. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న న్యూస్ ప్రింట్‌పై కూడా పన్నును తగ్గించారు. ఇక వైద్య పరికరాలపై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గేవి, పెరిగేవి ఏవో ఇప్పుడు చూద్దాం..
 
ధరలు తగ్గే వస్తువులు 
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
ఎలక్ట్రిక్‌ వాహనాలు
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు
 
ధరలు పెరిగే వస్తువులు
ఫర్నీచర్‌
చెప్పులు
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
కిచెన్‌లో వాడే వస్తువులు
క్లే ఐరన్‌
స్టీలు
కాపర్‌
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్‌ మిల్క్‌
వాల్‌ ఫ్యాన్స్‌
టేబుల్‌వేర్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments