Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : వేతన జీవుల చెవిలో పూలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులపై ఆయన ఏమాత్రం కనికరించలేదు. ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మం

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (13:31 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులపై ఆయన ఏమాత్రం కనికరించలేదు. ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మంది వేతన జీవులకు నిరాశే ఎదురైంది. ఆదాయ పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆయన తన బడ్జెట్ ప్రసంగలో ప్రకటించారు. దీంతో కోటానుకోట్ల మంది వేతన జీవుల చెవిలో పూలు పెట్టినట్టయింది. 
 
గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎన్నో సానుకూల మార్పులు చేశామని, ఈసారి మాత్రం స్లాబులలో ఎలాంటి మార్పు ఉండబోదని జైట్లీ కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు. ఇకపోతే, 2017-18 యేడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.6 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇక పరోక్ష పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగాయని తెలిపారు. పన్ను పరిధిలోకి కొత్తగా చాలామంది వచ్చి చేరుతున్నా.. టర్నోవర్ మాత్రం ఆశించినంతగా లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments