అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్న ప్రధాని మోడీ సర్కారు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (07:33 IST)
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కేంద్రం మరో అప్పును చేస్తుంది. ఫలితంగా కేంద్రం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది.
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో రూ.45 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సొంత ఆదాయం వాటా మూడింట రెండు వంతులు కూడా లేదు. అంటే సొంత ఆదాయం రూ.26,32,281 కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తం రూ.17,86,1816 కోట్లు అప్పే. అది బడ్జెట్ మొత్తంలో మూడో వంతు కన్నా ఎక్కువగా ఉంది. ఖర్చులోనూ భారీ మొత్తం అప్పులపై వడ్డీల చెల్లింపులకే తరలిపోతుంది. 
 
గత కొన్నేళ్లుగా కేంద్రం చెల్లిస్తున్న వడ్డీల మొత్తం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.8.05 లక్షల కోట్లు చెల్లించగా అది 2022-23 నాటికి ఈ మొత్తం రూ.9.40 లక్షల కోట్లకు చేరింది. వచ్చే అర్థిక సంవత్సరానికి ఇది రూ.10.79 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. మొత్తం వ్యయంలో ఇది నాలుగో వంతు వరకు ఉంటుంది ఇప్పటివరకు కేంద్రం చేసిన అప్పులు గత యేడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి రూ.147 లక్షల కోట్లకు చేరాయి. అందులే విదేశీ అప్పుల వాటాయే రూ.50 లక్షల కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments