Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్షిక బడ్జెట 2023-24 : కొత్త పన్ను విధానం ఇలా...

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (17:10 IST)
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. లక్షలాది మందికి ప్రయోజనం చేకూరేలా వ్యక్తిగత పన్ను రిబేట్‌ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదాయపన్నుకు సంబంధించిన కొత్త విధానాన్ని ఆమె ప్రవేశపెట్టారు. 
 
రూ.7 లక్షల ఆదాయం వరకు ఉన్న వ్యక్తులకు మినహాయింపులు ఉపయోగించుకుని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే, పన్ను చెల్లించు శ్లాబుల సంఖ్యను ఐదుకు తగ్గిస్తున్నట్టు తెలిపారు. కొత్త పన్ను విదానం డిఫాల్టుగా అమలుకానుంది. ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలివేశారు. 
 
కొత్త పన్ను విధానాన్ని పరిశీలిస్తే.. 
* రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* శ్లాబుల సంఖ్య 5కు తగ్గింపు. పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకు పెంపు. 
* రూ.0-3 లక్షలు ఆదాయం. ఎలాంటి పన్ను ఉండదు. 
* రూ.3-6 లక్షల ఆదాయం వరకు - 5 శాతం పన్ను
* రూ.6-9 లక్షల వరకు 10 శాతం పన్ను
* రూ.9-12 లక్షల వరకు 15 శాతం పన్ను 
* రూ.12-15 లక్షల వరకు 20 శాతం పన్ను 
* రూ.15 లక్షలకు పైగా ఆదాయం వచ్చేవారు 30 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments