Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌనం చెవుడుతో సమానం... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేష రాజకీయాలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీకి బ్యూరోక్రాట్ల నుంచి సెగ తగిలింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో ద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటూ ప్రధాని మోడీకి మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఘాటైన పదజాలాన్ని కూడా వారు ఉపయోగించారు. 
 
మౌనం చెవుడుతో సమానం అంటూ గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఈ తరహా పాలన రాజ్యాంగ నైతికతకు ప్రమాదమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను దాదాపు వంద మంది బ్యూరోక్రాట్లు (అఖిల భారత సర్వీసుల మాజీ అధికారులు) రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
"మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత. వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం చెవుడుతో సమానం" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments