Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వ్యాపారి ఆఫీసు గోడల్లో కరెన్సీ నోట్ల కట్టలు...

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (10:44 IST)
ముంబై మహానగరానికి చెందిన ఓ వ్యాపారికి చెందిన ఆఫీసు గోడల్లో కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ముంబై నగరంలోని కల్బాదేవి ప్రాంతానికి చెందిన ఈ వ్యాపారి వ్యాపార టర్నోవర్ గత మూడేళ్లలో రూ.1,764 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన జీఎస్టీ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇంట్లో ఒక్క రూపాయి కూడా లభించలేదు. దీంతో ఇంటి గోడలను, నేలను తవ్వి చూడగా ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు రూ.10 కోట్ల విలువైన నగదు, వెండి ఇటుకలను వెలుగు చూశాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కల్బాదేవి ప్రాంతానికి చెందిన చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం ఉంది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవర్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీంతో జీఎస్టీ ముంబై శాఖ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత మూడేళ్లలో ఏకంగా రూ.23 లక్షల నుంచి రూ.1764 కోట్లకు పెరగడంతో అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది.
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ వ్యాపారికి చెందిన వ్యాపార కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే, గోడకు అమర్చిన ఓ టైల్స్‌లో తేడా కనిపించింది. దీంతో ఆ టైల్‌ను తొలగించి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. నగదు కుక్కిన గోనె సంచులు కనిపించడంతో వాటిని వెలికి తీశారు. తీస్తున్న కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు నోరెళ్లబెట్టారు.
 
ఈ గోనె సంచలపై ఆరా తీయగా కుటుంబ సభ్యులు తమకేం తెలియదని చెప్పారు. దీంతో జీఎస్టీ అధికారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారులు వచ్చి ఆ నగదును లెక్కించగా అందులో రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. ఈ నోట్ల కట్టలకు సంబంధించి చాముండిపై జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments