Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మాటకారి... చేతలు శూన్యం : మంత్రి యనమల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు.

Yanamala Rama Krishnudu
Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆదివారం ప్రధాని అధికారిక నివాసం ఎదుట మెరుపు ధర్నా చేసిన టీడీపీ ఎంపీలను నిర్దాక్షిణ్యంగా లాగిపారేశారు. 
 
దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రావన్నారు. ప్రధాని మోడీ నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
నాటకాలలో బీజేపీది అందవేసిన చెయ్యని, ఏపీని, టీడీపీని విమర్శించడానికే జీవీఎన్‌ నరసింహారావుని బీజేపీ రాజ్యసభకు పంపినట్లుందని వ్యాఖ్యానించారు. చట్టంలో పొందు పర్చిన అంశాలను అమలు చేయమంటే బీజేపీకి ఎందుకంత కోపం వస్తుందని యనమల ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments