మోడీ మాటకారి... చేతలు శూన్యం : మంత్రి యనమల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు.

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆదివారం ప్రధాని అధికారిక నివాసం ఎదుట మెరుపు ధర్నా చేసిన టీడీపీ ఎంపీలను నిర్దాక్షిణ్యంగా లాగిపారేశారు. 
 
దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రావన్నారు. ప్రధాని మోడీ నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
నాటకాలలో బీజేపీది అందవేసిన చెయ్యని, ఏపీని, టీడీపీని విమర్శించడానికే జీవీఎన్‌ నరసింహారావుని బీజేపీ రాజ్యసభకు పంపినట్లుందని వ్యాఖ్యానించారు. చట్టంలో పొందు పర్చిన అంశాలను అమలు చేయమంటే బీజేపీకి ఎందుకంత కోపం వస్తుందని యనమల ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments