Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మాటకారి... చేతలు శూన్యం : మంత్రి యనమల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు.

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఓ మాటకారి అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, ఆయన మాటలే చెబుతారు తప్ప చేతలు శూన్యమనేది రుజువైందని అన్నారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేసుకుని ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆదివారం ప్రధాని అధికారిక నివాసం ఎదుట మెరుపు ధర్నా చేసిన టీడీపీ ఎంపీలను నిర్దాక్షిణ్యంగా లాగిపారేశారు. 
 
దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 2014లో వచ్చిన ఓట్లలో పదో వంతు ఓట్లు కూడా రావన్నారు. ప్రధాని మోడీ నాలుగేళ్లలో పేదలకు, మధ్య తరగతికి చేసిందేమీ లేదని, బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
నాటకాలలో బీజేపీది అందవేసిన చెయ్యని, ఏపీని, టీడీపీని విమర్శించడానికే జీవీఎన్‌ నరసింహారావుని బీజేపీ రాజ్యసభకు పంపినట్లుందని వ్యాఖ్యానించారు. చట్టంలో పొందు పర్చిన అంశాలను అమలు చేయమంటే బీజేపీకి ఎందుకంత కోపం వస్తుందని యనమల ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments