Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నిరాహారదీక్షలు... కడుపునిండా పూరీలు ఆరగించిన నేతలు

దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దేశ వ్యాప్తంగా నిరాహారదీక్షలు జరిగాయి. అయితే, ఈ దీక్షలో పాల్గొనే ముందు పలువురు కాంగ్రెస్ నేతలు కడుపునిండా పూరీలు లాంగించి దీక్షల

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:46 IST)
దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దేశ వ్యాప్తంగా నిరాహారదీక్షలు జరిగాయి. అయితే, ఈ దీక్షలో పాల్గొనే ముందు పలువురు కాంగ్రెస్ నేతలు కడుపునిండా పూరీలు లాంగించి దీక్షలో కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. 
 
ముఖ్యంగా, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జరిగిన ఈ నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే, పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్‌ఘాట్‌లో నిరాహార దీక్షకి వెళ్లే ముందు హోటల్‌లో పూరీలు లాగిస్తూ మీడియా కంటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఈ ఫొటో బయటకు రావడంతో కాంగ్రెస్ నేత అరవింద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఈ రోజు ఉదయం 10.30 నుంచి సాయత్రం 4.30 వరకు ఉంటుందని, తాము ఉదయం 8 గంటల ముందే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టి పెట్టకుండా, తాము ఏం తింటున్నామనే విషయంపై దృష్టి పెట్టారని విమర్శించారు.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments