అందుకేనా పెట్రోల్ రేట్ తగ్గించింది? ఏం తెలివి మోడీజీ?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (20:17 IST)
ఎన్నికలంటే అందరికీ భయమే. ఎన్నికల్లో అధికారంలోకి వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. అధికారంలోకి రావాలంటే ప్రజలు నమ్మాలి. ఓటెయ్యాలి. ఇదంతా తెలిసిందే. అయితే ఉన్నట్లుండి కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించడమేంటని అందరూ అనుకుంటూ ఉన్నారు. 

 
అయితే ఇందులో మోడీ ప్లాన్ ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ మూడు లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బిజెపి అగ్రనేతలు మేల్కొన్నారు. 

 
మరికొన్నిరోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పనసరిగా భావించారట. అందుకే ఉన్నట్లుండి దీపావళి కానుక అంటూ 5 రూపాయల దాకా పెట్రోల్ రేటును తగ్గించారట. 

 
అంతేకాదు బిజెపి పాలిత రాష్ట్రాలైన అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు వ్యాట్‌లో కోత కూడా విధించాయి. దీంతో భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయట. ఇక నుంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా నిర్ణయాలు ఉండాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట మోడీ. 

 
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటి రెండుసార్లు ఆలోచించాలని.. అలాగే నిపుణులు సలహాలు కూడా తీసుకోవాలని కూడా మోడీ సూచిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments