Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకు ఎమ్మెల్యే కిడారిని ఎందుకు చంపారంటే...

విశాఖపట్టణం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. నిజానికి కిడారి గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైకా

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:20 IST)
విశాఖపట్టణం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. నిజానికి కిడారి గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైకాపాను వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.
 
2014లో అరకు నుంచి పోటీ చేసిన కిడారి... శివేరి సోముపై విజయం సాధించారు. శివేరి సోము 2009లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. మావోయిస్టుల కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు తోపాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా ప్రాణాలు కోల్పోయారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో కిడారి, శివేరి సోముకు మంచి పేరు ఉంది. 
 
కిడారి ఆదివారం ఉదయం అరకులోనే ఉండి... మాజీ ఎమ్మెల్యే శివేరి సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామ పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కిడారి అక్కడికక్కడే చనిపోయారు. 
 
దీనికి కారణం పచ్చని అడవుల్లో పర్యావరణాన్ని దెబ్బతీసేలా మైనింగ్ తవ్వకాలను కిడారి చేపట్టారు. వీటిపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరిస్తూ వచ్చారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న క్వారీని తక్షణం మూసివేయాలని మావోలు డిమాండ్ చేశారు. కానీ, ఇవేమీ పట్టించుకోని కిడారి.. యధేచ్చగా మైనింగ్ తవ్వకాలు జరిపిస్తూ వచ్చారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై కాల్పులు జరిపారి హత్య చేశారు. 
 
నిజానికి విశాఖ మన్యంలో గత కొంతకాలంగా మావోయిస్టులు అలజడి లేదు. చాలాకాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు. గ్రేహౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఇపుడు కాల్పులకు తెగబడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments