Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...

అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారుల

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:09 IST)
అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు ఈ విషయాన్ని చేరవేశారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు, హత్యలు మానవత్వానికే మాయనిమచ్చని, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు.
 
వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. డుంబ్రీగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద బసులో వెళుతున్న కిడారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్నారు. నిజానికి మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తన క్వారీ మైనింగ్‌ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments