Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...

అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారుల

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:09 IST)
అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు ఈ విషయాన్ని చేరవేశారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు, హత్యలు మానవత్వానికే మాయనిమచ్చని, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు.
 
వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. డుంబ్రీగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద బసులో వెళుతున్న కిడారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్నారు. నిజానికి మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తన క్వారీ మైనింగ్‌ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments