హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి.. జగన్ పైన జవహర్ సెటైర్స్

Webdunia
గురువారం, 13 మే 2021 (22:43 IST)
ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత జవహర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పరోక్షంగా సెటైర్లు విసిరారు. ఆయన ఇలా పేర్కొన్నారు. మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లు వనుక్కొంటూ వెళ్లి అయిన కాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు.

మొండికేసిన సంగం డైరీ చైర్మన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినక పోతే జువారి సిమెంట్, అమర్ రాజా బాటరీస్ కు పొల్యూషన్ నోటీస్ ఇచ్చి మూసేయించాము. వ్యాక్సిన్ కంపెనీవోడు ఇంతకన్నా మొనగాడా ఏందీ?

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టి పట్టుకొద్దాం. అంత వద్దని అనుకొంటే సంగం డైరీలో సర్వర్లు లాక్కొచ్చినట్లు వ్యాక్సిన్ కంపెనీ వాడి సర్వర్లు పట్టుకొచ్చి మన సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇద్దాం.

వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని గుద్ది మనకు ఇచ్చేస్తారు. వాక్సిన్లు ఇప్పించాలని చంద్రబాబును రామోజీ రావును మనం బతిమాలుకోవడం ఏందన్నా? సిగ్గు పోతోంది. మన మోడల్ మనకు ఉందిగా!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments