Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి బాంబు పేలుళ్ళ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (08:46 IST)
గత 2006లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన వలీ ఉల్లా ఖాన్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో వలీ ప్రధాన సూత్రధారి కావడంతో ఆయనకు ఘజియాబాద్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. 
 
2006లో జరిగిన ఈ పేలుళ్లలో 20 మందికిపై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా వంద మందికిపై గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, కేసు విచారణ ఘజియాబాద్ కోర్టులో సాగింది. ఈ మూడు కేసుల్లో ఏ1గా వలీ ఉన్నారు. ఇందులో తొలి కేసులో ఉరిశిక్ష విధించగా, రెండో కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది. 
 
మూడో కేసులో సరైన సక్ష్యాధారాలు లేకపోవడంతో వలీని నిర్దోషిగా విడుదల చేసింది. వారణాసి పేలుళ్ల తర్వాత ఈ కేసులో వలీ తరపున విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ కేసు విచారణను ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ కోర్టు బదిలీ చేసింది. ఇపుడు ఈ కేసు కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments