Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికుడిని చితక్కొట్టిన టీసీలు.. సస్పెండ్ చేసిన రైల్వే శాఖ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (13:21 IST)
ప్రయాణ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు టీసీలు దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వేశాఖ సీరియస్‌గా స్పందించింది. ప్రయాణికుడిపై దాడి చేసిన ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, ముంబై నుంచి జైనగర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా జనరల్ బోగీలో అప్పర్ బెర్త్ సీట్లో కూర్చొనివున్నాడు. ఆ బోగీలోకి వచ్చిన ఇద్దరు టీసీలు ఆప్రయాణికుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకరు సదరు ప్రయాణికుడిని కాలు పట్టుకుని కిందకు లాగిపడేశాడు. ఆ తర్వాత బూటుకాలితో నడుంపై తన్నగా మరో టీసీ ముఖంపై తన్నాడు. 
 
దీంతో ఇతర ప్రయాణికుులు టీసీలను నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ దాడి ఘటనను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సీరియస్‌గా తీసుకుని ఇద్దరు టీసీలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థాంశంతో మోహ‌న్.జి భారీ చిత్రం ద్రౌప‌తి -2 ఫ‌స్ట్ లుక్

SVK: కొరియా నటి నాయికగా మంగోలియన్ ఆర్టిస్ట్ విలన్ గా ఎస్వీ కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments