Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు షాక్... సైకిలెక్కనున్న వంగవీటి రాధా.. ముహూర్తం ఫిక్స్

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (10:38 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత, స్థానికంగా మంచిపట్టున్న వంగవీటి రాధా షాకివ్వనున్నారు. ఈయన వైకాపాకు గుడ్‌బై చెప్పి.. సైకిలెక్కనున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 25వ తేదీన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. 
 
సోమవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారు.
 
అదేసమయంలో వైసీపీకి రాజీనామా చేసిన రాధా సోమవారం రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వెల్లడైంది. దీంతో ఆయన టీడీపీలో చేరాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
 
అనంతరం జరిగిన రాధా-రంగా మిత్రమండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్‌పై పలు ఆరోపణలు చేశారు. జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని, అడిగినంత ఇవ్వలేదనే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అభిమానులు ఎవరూ వైసీపీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments