తండ్రిని చంపిన పార్టీలో వంగవీటి రాధ చేరడం ఏమిటి?: వంగవీటి నరేంద్ర

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:10 IST)
వైకాపాకు రాజీనామా చేసిన రంగా తనయుడు వంగవీటి రాధా టీడీపీలో చేరారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధాకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. 
 
రాష్ట్రాన్ని దెబ్బతీసే వ్యక్తులతో కలిసిన జగన్.. తన విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారని వంగవీటి రాధ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ఇకనైనా మారాలని.. ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని వంగవీటి రాధ అన్నారు. ప్రజలు తప్పకుండా వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్ష హోదా కట్టబెడతారని కామెంట్స్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను హత్య చేయించిన పార్టీలో ఆయన కుమారుడు రాధా చేరడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధ చర్యతో రంగా అభిమానులంతా క్షోభకు గురయ్యారని, ఎవరూ సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. మీడియాతో వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, రంగా హత్యకు కారణం టీడీపీయేనని ఎవరిని అడిగినా చెబుతారని గుర్తు చేశారు. 
 
అలాంటి పార్టీలో రాధా చేరడం బాధను కలిగిస్తోందని అన్నారు. గతంలో రంగా సతీమణి చేసిన తప్పునే ప్రస్తుతం రాధా కూడా చేస్తున్నాడని విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకున్న రాధను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని నరేంద్ర అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments