Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రిపై దాడి చేసిన విద్యార్థులు... రక్షించిన రాష్ట్ర గవర్నర్

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (15:12 IST)
బీజేపీ, కేంద్రమంత్రి బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దాడి చేశారు. ఘెరావ్ చేశారు. దీంతో ఆయన్ను ఆ రాష్ట్ర గవర్నర్ సురక్షితంగా రక్షించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో గురువారం బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు బాబూల్ సుప్రియో హాజరయ్యారు. ఆయన రాకను నిరసిస్తూ భారీ సంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ముఖ్యంగా, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ఘెరావ్ చేశాయి. 
 
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్‌ దేబ్‌నాథ్‌ విమర్శించారు.
 
ఈ విషయం తెలుసుకున్న గవర్నర్‌ ధనకర్‌ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
 
క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్‌ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ సీఎస్‌ను గవర్నర్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments