Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ అత్యున్నత పదవుల్లో ఇద్దరు తెలుగువాళ్లు... నెట్టింట ఫొటో వైరల్

Two Telugus
Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:18 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ... ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ నిలుచున్న ఫొటో అది.

ప్రమాణ స్వీకారం అనంతరం.. చీఫ్ జస్టిస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించారు. మర్యాదపూర్వకంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతి నమస్కారం చేశారు. ఇప్పుడీ ఫొటోను తెలుగు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు దేశ అత్యున్నత పదవుల్లో ఉండటం సాటి తెలుగువారికి గర్వకారణం అంటూ ట్వీట్ చేస్తున్నారు.

భారత 48వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం ముగియడంతో శనివారం ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఈ పదవిలో కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments