Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజ్ తక్ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూత

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:29 IST)
ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. రోహిత్ సర్దానా దాదాపు వారం క్రితం కరోనావైరస్ బారిన పడ్డారు. ఆయన మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఐతే శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.
 
జీ నెట్‌వర్క్ నుండి తన మాజీ సహోద్యోగి సుధీర్ చౌదరితో సహా పలువురు జర్నలిస్టులు తన జర్నలిస్ట్ ఆకస్మిక మరణం గురించి సమాచారాన్ని ట్వీట్ చేశారు. టీవీ టుడే సంస్థలో సర్దానా ప్రస్తుత సహోద్యోగి కూడా టీవీ యాంకర్ మరణానికి సంతాపం తెలిపారు.
 
ఏప్రిల్ 24న రోహిత్ స్వయంగా కరోనావైరస్ బారిన పడినట్లు ట్వీట్ చేశాడు. గుండెపోటుతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు సమాచారం. నిర్భయమైన విధానం, విభిన్న స్వర శైలికి ప్రసిద్ది చెందిన సర్దానా జీ నెట్‌వర్క్‌లో 'తాల్ తోక్ కే', ఆజ్ తక్‌లోని 'దంగల్' వంటి ప్రైమ్-టైమ్ టీవీ షోలను నిర్వహించారు.
 
ఆయన 2018 గణేష్ విద్యార్థి పురస్కార్ అవార్డు గ్రహీత కూడా. టీవీ యాంకర్ ఆకస్మిక మరణంతో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, రోహిత్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయనను "ఓ బలమైన, సూటిగా ప్రశ్నించే జర్నలిస్ట్" అని అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments