26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరం.. దేవ్ ముద్రిక అనే పేరుతో...

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (12:46 IST)
Dev Mudrika
వజ్రం చాలా ఖరీదైన సంగతి తెలిసిందే. ఓ ఉంగరంలో 26వేల వజ్రాలు ఉన్నాయి. ఏకంగా 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసి రికార్డు సృష్టించింది.. యూపీలోని ఓ జ్యువెలరీ షాప్. వివరాల్లోకి వెళితే.... యూపీలోని మీరట్ కు చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది. 
 
పువ్వు ఆకారంలో ఉన్న ధగధగ మెరుస్తున్న ఈ ఉంగరానికి దేవ్ ముద్రిక అని పేరు పెట్టినట్లు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ తెలిపారు. ఇది వరకు ఓ సంస్థ 24వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసిందని చెప్పుకొచ్చారు. 
 
తొలుత సాఫ్ట్ వేర్ ద్వారా దేవ్ ముద్రిక డిజైన్ ను రూపొందించామన్నారు. తర్వాత కళాకారులతో తయారు చేయించామని తెలిపారు. రెండు వేళ్లకు పెట్టుకునే ఈ ఉంగరం ధర ఇంకా నిర్ణయించలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments