Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి ఈ సహోదరులు ఎలా మొక్కు తీర్చుకున్నారంటే?

Webdunia
సోమవారం, 16 మే 2022 (21:34 IST)
Tirumala
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయానికి చాలామంది భక్తులు మొక్కులతో చేరుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా కాలినడకన వస్తుంటారు. అందుకోసం భక్తులకు అలిపిరి అలాగే శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంటుంది. 
 
ఈ రెండు మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తులు రకరకాల మొక్కులతో కాలి నడకను ప్రారంభిస్తారు. ఒకరు మోకాలితో నడిస్తే మరొకరు పొర్లు దండలు చేస్తూ పైకి చేరుకుంటారు. ఇంకొకరు మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ రాస్తూ కర్పూరం వెలిగించుకుంటు వెళ్తారు.
 
అయితే  ఇద్దరు సహోదరులు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగించుకుంటూ వెళ్తున్న విధానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు కొందరు భక్తులు. ఓ గరాటుకు అమర్చిన పైపు ద్వారా, ఒంగకుండానే ఒకరు కర్పూరాన్ని మెట్టుపై ఉంచుతుండగా, ఇంకో వ్యక్తి మాత్రం పొడుగాటి కర్రకు మంట వెలిగించి ఆ కర్పూరాలను అంటించుకుంటూ వెళ్తున్నాడు.
 
కొందరు భక్తులు ఈ ఐడియా బాగానే ఉందని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం కష్టపడి చెల్లించే మొక్కుబడిని కూడా వారి అవసరానికి, సుఖానికి కష్టం లేకుండా చెల్లించే స్థాయికి భక్తుల ఆలోచలు వచ్చాయి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వీరి ఇద్దరికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

Avatar: అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3Dలో పునఃవిడుదల తెలుపుతూ కొత్త ట్రైలర్‌ విడుదల

Nani: నాని నటిస్తున్న ది ప్యారడైజ్ అప్ డేట్ లెజెండరీ నటుడు గురించి రాబోతుందా...

Naveen Polishetty: బంగారు ఆభరణాల స్పూఫ్ తో అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్

YVS: మాతృ మూర్తి రత్నకుమారి అస్తమం పట్ల వై వీ ఎస్ చౌదరి జ్నాపకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments