Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక కోరికలతో ఆ మగపులి.. ఆడపులిని ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (11:08 IST)
కామాంధులు రెచ్చిపోవడంతో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మానవులే మృగాలుగా మారిపోతున్న తరుణంలో.. ఓ మృగం లైంగిక కోరికలతో ఆడపులిని మెడకొరికి చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో చోటుచేసుకుంది.

ఉదయపూర్ బయోలాజికల్ పార్కులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదయపూర్ నగరంలోని సజ్జన్‌ఘడ్ బయోలాజికల్ పార్కులో ఆడపులి దామిని, మగపులి కుమార్‌ని అధికారులు రెండు వేర్వేరు ఎన్‌క్లోజర్లలో ఉంచారు. పటిష్టమైన భద్రత కల్పించారు.
 
కానీ కుమార్ అనే పేరు ఉన్న మగపులి కొన్ని రోజులుగా దూకుడుగా ఉండటంతో దామిని అనే ఆడ పులిని పక్కనే ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజరులో బంధించారు. అకస్మాత్తుగా గురువారం సాయంత్రం మగపులి ఆడపులి ఎన్‌క్లోజరులోకి బలవంతంగా వైర్లు తెంచుకుని వెళ్ళింది. వెళ్ళడం వెళ్ళడం ఆడపులి మెడ పట్టుకుని కొరికింది. ఈ ఘటనలో ఆడపులి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు.
 
అయితే జంతు ప్రేమికులు మాత్రం అధికారుల అసమర్ధత కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇనుప తీగను కూడా తెంపి వెళ్ళడానికి గలకారణాలు ఏమి ఉంటాయి అనే దాని మీద విచారణ జరిపిన అధికారులు, అది లైంగిక కోరికలతోనే ఆ విధంగా వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో కుమార్‌కి కూడా గాయాలు అయ్యాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం