Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో వరదలు.. హాయిగా పడకగదిలో సేదతీరుతున్న పులి.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 18 జులై 2019 (17:12 IST)
అస్సాంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. నివాసాలకు ఇళ్లు లేకుండా సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అస్సాం వరదల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ప్రజలు తగిన వసతులు లేకుండా నానా తంటాలు పడుతున్నారు. 
 
ఇక ఈ వరదల కారణంగా అటవీ ప్రాంతాల్లో వుండే వన్యమృగాలు సైతం ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములు ఇళ్లల్లోకి చేరుకుంటున్నాయి. తాజాగా ఓ పులి వరద బాధితుల ఇంట్లోకి చొరబడింది. అక్కడే నివాసం వుంటోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కజిరంగ నేషనల్ పార్కు వుంచి ఈ పులి మానవ సంచార ప్రాంతానికి చేరుకుందని తెలుస్తోంది. 
 
అంతేకాకుండా ఓ ఇంట్లోకి వెళ్ళిన పులి హాయిగా బెడ్ మీద కూర్చుండిపోయింది. ఇలా ఇంట్లోని పడకగదిలో హాయిగా పులిరాజు వున్న ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులు పోస్టు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులిని పట్టుకుని అడవుల్లో వదిలేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments