వరదల్లో చిక్కుకున్న రైలు ప్రయాణికులు.. రక్షించిన వెస్ట్రన్ నేవీ కమాండ్

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి

Webdunia
బుధవారం, 11 జులై 2018 (10:13 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి కొట్టుకునిపోయాయి. దీంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
 
ఈ పరిస్థితుల్లో నాలా సోపారా - వాసై రోడ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్స్ బాగా దెబ్బతిన్నాయి. దీంతో నాలా సొపొరా స్టేషన్‌లో రైలు ప్రయాణికులు చిక్కుకుని పోయారు. వీరిని మంగళవారం రాత్రి వెస్ట్రన్ నావల్ కమాండ్ సురక్షితంగా రక్షించింది.
 
వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన నేవీ.. భారీ వాహనాల సాయంతో వీరిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గత గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరం నీట మునిగిన విషయం తెల్సిందే. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాదంలో చిక్కున్న ముంబై నగర వాసులను రక్షించే పనుల్లో ఇండియన్ నేవీ నిమగ్నమైవుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments