Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదల్లో చిక్కుకున్న రైలు ప్రయాణికులు.. రక్షించిన వెస్ట్రన్ నేవీ కమాండ్

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి

Webdunia
బుధవారం, 11 జులై 2018 (10:13 IST)
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి కొట్టుకునిపోయాయి. దీంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
 
ఈ పరిస్థితుల్లో నాలా సోపారా - వాసై రోడ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్స్ బాగా దెబ్బతిన్నాయి. దీంతో నాలా సొపొరా స్టేషన్‌లో రైలు ప్రయాణికులు చిక్కుకుని పోయారు. వీరిని మంగళవారం రాత్రి వెస్ట్రన్ నావల్ కమాండ్ సురక్షితంగా రక్షించింది.
 
వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన నేవీ.. భారీ వాహనాల సాయంతో వీరిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గత గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరం నీట మునిగిన విషయం తెల్సిందే. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాదంలో చిక్కున్న ముంబై నగర వాసులను రక్షించే పనుల్లో ఇండియన్ నేవీ నిమగ్నమైవుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments