Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి ఏమైంది..? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? ఒక్కసారిగా వేగంగా..?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (19:58 IST)
భూమికి ఏమైంది..? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. దశాబ్దాల పాటు మెల్లగా ప్రశాంతంగా తిరిగిన భూమి.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వేగంగా తిరుగుతోంది.. ఇప్పుడు ఇదే ప్రశ్న ఖగోళ సైంటిస్టుల బుర్రలను తొలిచివేస్తోంది.
 
2020లో భూమి భ్రమణం మళ్లీ వేగవంతమైంది. 2005లో అతి తక్కువ రోజుగా రికార్డు అయింది. 2020లో ఆ రికార్డు 28 సార్లు బ్రేక్ చేసింది. సగటు రోజు ఎక్కువ అవుతోంది. 2020 వరకు ఏడాదిలో సగటున, రోజులు 0.5 మిల్లీసెకన్లు తక్కువగా నమోదయ్యాయి. దీని ఫలితంగా 2021లో భూమి ఇంత వేగంగా తిరుగుతోంది. భూమి భ్రమణ చరిత్రలో మొదటిసారిగా నెగటీవ్ లీపు సెకను అవసరం పడింది. 
 
గత 50 ఏళ్లలో కంటే భూమి ఇప్పుడు వేగంగా తిరుగుతోందని సైంటిస్టులు కచ్చితంగా చెప్తున్నారు. గతంలో 2021లో సగటు రోజు సాధారణ 86,400 సెకన్ల కన్నా 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంచనా వేశారు.
 
కాగా.. భూపరిభ్రమణం అనేది ఒక నిర్దిష్ట కక్ష్యలో ఉంటుంది. తన కక్ష్యలో భూమి 365 సార్లు సూర్యుని చుట్టూ పరిభమ్రిస్తే.. ఒక ఏడాదిగా లెక్కిస్తారు. అయితే ఎప్పటిలా భూమి నిదానంగా తిరగడం లేదంట.. గతంలో కంటే ఇప్పుడు భూమి వేగంగా తిరుగుతుందని ఖగోళ సైంటిస్టులు అంటున్నారు. వాస్తవానికి.. వందల మిలియన్ల ఏళ్ల క్రితం భూమి సూర్యుని చుట్టూ పూర్తిగా తిరిగిరావడానికి 420సార్లు పరిభ్రమించిందంట. 
 
మిలియన్ల ఏళ్ల క్రితమే భూమి.. 444-419 సార్లు తిరిగిందని సైంటిస్టులు గణాంకాలను లెక్కగట్టారు. అంటే.. అప్పుడు ఒక ఏడాదిలో భూమి 420 సార్లు పరిభ్రమించింది. కొన్ని మిలియన్ల ఏళ్ల తర్వాత భూమి వేగం 410కి నెమ్మదించింది. భూమి వేగంలో మార్పులకు అనేక కారణాలు ఉంటాయని అంటున్నారు సైంటిస్టులు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు కారణం కావొచ్చు. భూమికి దూరంగా చంద్రుడు కదలడమే అతిపెద్ద కారకమని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments