రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు సిద్ధం : టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళన ఉధృతం చేశారు. హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ తోట నర్సింహం ప్రకటించారు. అయితే, ముందు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బయటకు వస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. 
 
విజయసాయిరెడ్డికి సిగ్గుందా అని మండిపడ్డారు. పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ అని... కేవలం లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసి ఇతరులు రాజీనామా చేయాలని అనడం సరికాదన్నారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్ధుడు చంద్రబాబు మాత్రమే అని ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. బీజేపీతో వైసీపీ నేతలు లాలూచీ పడ్డారని విమర్శించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడం లేదని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

మూడు డిఫరెంట్ కంటెంట్ తో సిద్దమైన నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

Panjaram: వెన్నులో వణుకు పుట్టించేలా పంజరం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments