Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు సిద్ధం : టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళన ఉధృతం చేశారు. హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ తోట నర్సింహం ప్రకటించారు. అయితే, ముందు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బయటకు వస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. 
 
విజయసాయిరెడ్డికి సిగ్గుందా అని మండిపడ్డారు. పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ అని... కేవలం లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసి ఇతరులు రాజీనామా చేయాలని అనడం సరికాదన్నారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్ధుడు చంద్రబాబు మాత్రమే అని ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. బీజేపీతో వైసీపీ నేతలు లాలూచీ పడ్డారని విమర్శించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడం లేదని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments