Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో మంగళగిరి, గో తిరుపతి: నారా లోకేష్ సీటు గురించి...

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (19:44 IST)
జమిలీ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరో సంవత్సరంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలన్నది పార్టీల ఆలోచన. అందుకే ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెట్టేస్తున్నారు నేతలు. 

 
అయితే ఎపిలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో టిడిపిలో ప్రధాన నేతలుగా ఉన్న చంద్రబాబు, నారా లోకేష్‌లు గెలుపే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తామని వైసిపి నేతలు సవాల్ చేస్తుంటే మంగళగిరిలో ఈసారి లోకేష్ ఓటమి ఖాయమంటూ అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు.

 
ఈ నేపథ్యంలో కుప్పంలో తాను ఎలాగైనా గెలవగలనని.. కానీ ఎలాగైనా లోకేష్‌ను గెలిపించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారట. అందుకే ఈసారి ఎలాగైనా నారా లోకేష్‌ను తిరుపతి నియోజకవర్గంలో నిలబెట్టాలనుకుంటున్నారట. ఎందుకంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.

 
ఈ నేపథ్యంలో తిరుపతిలో భూమన కుమారుడు నిలిచే అవకాశముంది. కాబట్టి తిరుపతి లాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేగా నిలబడితే గెలుపుతో పాటు టెంపుల్ సిటీ కావడంతో ప్రాధాన్యత ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. ఇదే విషయాన్ని లోకేష్‌కు కూడా చెప్పారట. 

 
పార్టీ నేతలతో మరోసారి చంద్రబాబు చర్చించి తిరుపతినే లోకేష్‌కు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇదే జరిగితే తిరుపతిలో హాట్ హాట్‌గా ఎన్నికలు జరుగుతాయన్నది సుస్పష్టం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments