సబ్యసాచితో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ప్రకటనపై ట్రోల్స్...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (19:51 IST)
గతేడాది దీపావళి ప్రకటన కారణంగా టాటా గ్రూప్ నగల బ్రాండ్ తనిష్క్ వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తనిష్క్‌ను బహిష్కరించాలని ట్రోలర్లు చేశారు. తనిష్క్ హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. అయితే, వివాదం ముదిరినప్పుడు, తనిష్క్ ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
 
 
దీని తర్వాత ఇటీవల ఫ్యాబ్ ఇండియాపై వివాదం నెలకొంది. దీపావళి పండుగను 'జష్న్-ఎ-రివాజ్' అని పిలువడం ద్వారా ఫ్యాబ్ ఇండియా తన దుస్తులను ప్రమోట్ చేసింది. హిందువుల దీపావళి పండుగకు జష్న్-ఇ రివాజ్ అనే ఉర్దూ పేరు పెట్టడంలో అర్థం ఏంటనే విమర్శించారు. ఈ వివాదం తర్వాత, ఫ్యాబ్ ఇండియా కూడా సోషల్ మీడియా నుండి తన ప్రకటనను తీసివేయవలసి వచ్చింది.
 
 
ఇప్పుడు మరోసారి ఓ ప్రకటనపై దుమారం రేగింది. ఇప్పుడు ఫ్యాషన్- జ్యువెలరీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ యొక్క కొత్త ప్రకటన ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌లో మంగళసూత్ర ప్రకటనకు సంబంధించిన కొన్ని మోడల్స్ చిత్రాలు ఉన్నాయి. చాలామంది ఈ ఫోటోలను అశ్లీలంగా, నగ్నంగా పేర్కొంటూ వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ప్రజలు రాస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments